Rapidx: దేశంలోనే తొలి ప్రాంతీయ రైలు సర్వీస్.. రూ.160 కి.మీ వేగంతో పరుగులు.. ఎక్కడంటే?

RRTS: దేశంలోని మొట్టమొదటి ప్రాంతీయ రైలు సర్వీస్ RAPIDEX జులైలో పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. RRTSలో రైళ్ల గరిష్ట వేగం గంటకు 160 కి.మీ.

Jyothi
Updated on: 3 July 2023 9:30 PM IST
RAPIDEX, the countrys first regional train service, is set to become fully operational by July The maximum speed of trains in RRTS is 160 kmph
X

Rapidx: దేశంలోనే తొలి ప్రాంతీయ రైలు సర్వీస్.. రూ.160 కి.మీ వేగంతో పరుగులు.. ఎక్కడంటే?

Indian Railways: దేశంలోని మొట్టమొదటి ప్రాంతీయ రైలు సర్వీస్ RAPIDEX జులైలో పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. తొలుత 17 కి.మీ మార్గంలో నడపనున్నారు. ఈ మార్గంలో ఐదు సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపోలు ఉన్నాయి. ఈ ఐదు స్టేషన్ల పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విభాగం ఢిల్లీ-మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS)లో భాగంగా ఉండనుంది.

RRTSను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) ర్యాపిడ్ రైల్ సర్వీస్ ఇన్‌చార్జి మాట్లాడుతూ, కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎమ్‌ఆర్‌ఎస్) నుంచి భద్రతా అనుమతులు అందాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. RRTSలో రైళ్ల గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. దేశంలోనే రైల్వే వ్యవస్థ మొత్తం పొడవునా హైస్పీడ్ ఆపరేషన్ కోసం తెరవడం ఇదే తొలిసారి.

25 కి.మీలో నాలుగు స్టేషన్లు ..

ప్రాధాన్యత విభాగంతో పాటు సాహిబాబాద్-మీరట్ సౌత్ స్టేషన్ మధ్య 42 కి.మీ వయాడక్ట్ కూడా పూర్తయింది. దుహై డిపో తర్వాత, 25 కి.మీ పొడవున్న సెక్షన్‌లో మురాద్‌నగర్, మోదీనగర్ సౌత్, మోదీనగర్ నార్త్, మీరట్ సౌత్ అనే నాలుగు స్టేషన్లు ఉన్నాయి. తదుపరి 17 కిలోమీటర్ల ట్రాక్‌ను ప్రారంభించిన తర్వాత ఈ విభాగం ప్రారంభమవుతుంది.

RRTS నిర్మాణ పనులు జూన్ 2019లో ప్రారంభమయ్యాయి. మీరట్‌లో మెట్రో సేవలతో కూడిన మొత్తం 82.15 కిలోమీటర్ల పొడవైన కారిడార్ జూన్ 2025 నాటికి పని చేయనున్నట్లు అధికారి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story