IRCTC Tour Package: కేవలం రూ. 917లతో 7 జ్యోతిర్లింగాలను దర్శించే లక్కీ ఛాన్స్.. IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీ తెలుసా?

IRCTC ఒక గొప్ప టూర్ ప్యాకేజీతో ప్రయాణికుల ముందుకు వచ్చింది. దీని కింద ఏడు జ్యోతిర్లింగాలను దర్శించే ఛాన్స్ ఉంది. ఈ ప్రయాణం భారత్ గౌరవ్ రైలు ద్వారా జరుగుతుంది. మీరు IRCTC నుంచి సరసమైన ధరలతో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

Jyothi
Updated on: 12 July 2023 9:00 PM IST
Lucky Chance to visit 7 Jyotirlingas with just rs 917 check here IRCTC tour package
X

IRCTC Tour Package: కేవలం రూ. 917లతో 7 జ్యోతిర్లింగాలను దర్శించే లక్కీ ఛాన్స్.. IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీ తెలుసా?

IRCTC Tour Package: IRCTC ఒక గొప్ప టూర్ ప్యాకేజీతో ప్రయాణికుల ముందుకు వచ్చింది. దీని కింద ఏడు జ్యోతిర్లింగాలను దర్శించే ఛాన్స్ ఉంది. ఈ ప్రయాణం భారత్ గౌరవ్ రైలు ద్వారా జరుగుతుంది. మీరు IRCTC నుంచి సరసమైన ధరలతో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ భారత్ గౌరవ్ రైలును ప్రారంభించనుంది.

ఏడు జ్యోతిర్లింగ్ యాత్ర కింద ప్రయాణికులు ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, భెంట్ ద్వారక, ద్వారకాధీష్ ఆలయం, నాగేశ్వర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, భీమశంకర్ జ్యోతిర్లింగాలను సందర్శించగలరు. ఈ పర్యటన 9 రాత్రులు, 10 రోజుల ప్యాకేజీతో వస్తుంది. ఇది జులై 10 నుంచి ప్రారంభమై ఆగస్టు 5 వరకు కొనసాగుతుంది.

ఏయే దేవాలయాలను సందర్శించవచ్చు..

ఈ టూర్ ప్యాకేజీలో పర్యాటకులు ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, భెంట్ ద్వారక, ద్వారకాధీష్ ఆలయం, నాగేశ్వర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, భీమాశంకర్ జ్యోతిర్లింగాలను సందర్శించగలరు. ఈ రైలులో ప్రయాణించడానికి బోర్డింగ్ స్టేషన్‌లు రిషికేశ్, హరిద్వార్, మొరాదాబాద్, బరేలీ, షాజహాన్‌పూర్, హర్దోయ్, లక్నో, కాన్పూర్, ఒరై వీరాంగన లక్ష్మీబాయి, లలిత్‌పూర్‌లలో ఉంటుంది. ఇందుకోసం థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ క్లాస్, స్లీపర్ క్లాస్‌లకు ట్రావెలర్స్ బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజీ కింద అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి శాఖాహారం అందించనున్నారు. దీంతో పాటు ఏసీ లేదా నాన్ ఏసీ బస్సుల్లో స్థానిక ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.

ప్యాకేజీ ధరలు..

ఈ టూర్ ప్యాకేజీ గురించి మాట్లాడితే, మీరు దాని మూడు విభాగాలలో బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఎకానమీ క్లాస్ నుంచి స్టాండర్డ్ క్లాస్, కంఫర్ట్ క్లాస్ వరకు బుకింగ్ చేసుకోవచ్చు. మీరు స్లీపర్ క్లాస్ కోసం బుక్ చేసుకుంటే, ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులకు బుకింగ్ చేస్తే రూ.18,925 అవుతుంది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు ప్యాకేజీ ధర రూ. 15,893లుగా పేర్కొన్నారు.

థర్డ్ ఏసీలో బుకింగ్ చేయడానికి, ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులకు ఛార్జీల కోసం మీరు ఒక్కొక్కరికి రూ.31769 చెల్లించాల్సి ఉంది. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బుకింగ్ ధర రూ.25,858లుగా పేర్కొన్నారు. ఇది కాకుండా కంఫర్ట్ కేటగిరీకి అంటే సెకండ్ ఏసీకి ఒక్కో వ్యక్తికి రూ.42163 చార్జీ ఉంటుంది. అదే సమయంలో, ఐదు నుండి 11 సంవత్సరాల పిల్లల కోసం టికెట్ బుకింగ్ రూ. 34072 అవుతుంది.

EMIలో కూడా బుకింగ్ సౌకర్యం..

మీరు దీన్ని EMIలో కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు నెలకు రూ. 917తో ఎల్‌టీసీ, ఇఎంఐ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. మీరు ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకుల నుంచి EMI సౌకర్యాన్ని పొందవచ్చు.

Jyothi

Jyothi

Next Story