ప్రో కబడ్డీ లీగ్ : మరో టై మ్యాచ్..

ప్రో కబడ్డీ లీగ్ : మరో టై మ్యాచ్..
x
Highlights

ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బుధవారం జరిగిన రెండు మ్యాచుల్లో ఒకటి టైగా ముగిసింది. తమిళ తలైవాస్, యూపీ యోధాల మధ్య జరిగిన మ్యాచ్ టై కాగా, పట్నా పైరేట్స్, హరియానా స్టీలర్స్ మధ్య జరిగిన పోటీలో హరియానా జట్టు విజయాన్ని అందుకుంది.

ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లలో భాగంగా బుధవారం జరిగిన రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్ టై గా ముగిసింది. తమిళ తలైవాస్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని యూపీ యోధ జట్టు పూర్తిగా అడ్డుకోవడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. యూపీ యోధ, తమిళ్‌ తలైవాస్‌ జట్ల మధ్య ఉత్కంఠగా మ్యాచ్ సాగింది. రెండు జట్లూ నువ్వా నేనా అనే పద్ధతిలో ఆడాయి. కానీ చివరికి 28:28 స్కోరుతో మ్యాచ్ టై అయింది.

ఇక మరో మ్యాచ్ లో హరియాణా స్టీలర్స్‌ రెండో విజయాన్ని అందుకుంది. పట్నాపై చక్కని ప్రదర్శన కనబరిచిన హరియాణా 9పాయింట్ల తేడాతో విజయం సాధించింది. స్టీలర్స్‌ జట్టులో రైడర్‌ వికాస్‌ (10) చక్కని ప్రదర్శన కనబరిచాడు. వినయ్‌ (6) కూడా రైడింగ్‌లో మెరువగా... డిఫెండర్లు రవి కుమార్‌ (4), సునీల్‌ (4), ధర్మరాజ్‌ చేరలతన్‌ (3) ప్రత్యర్థుల్ని అద్భుతంగా టాకిల్‌ చేయడంతో విజయం సులువైంది. పట్నా జట్టులో ప్రదీప్‌ నర్వాల్‌ 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. ప్రదీప్ కు సరైన సహకారం లభించకపోవడంతో పూనే పరాజయం పాలవ్వక తప్పలేదు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories