వైసీపీ ఎంపీ బాలశౌరికి పార్లమెంట్ కమిటీలో కీలక పదవి
Machilipatnam MP Balasouri (file photo)
వైసీపీకి చెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి పార్లమెంట్ కమిటీల్లో అత్యంత కీలకంగా భావించే పదవి దక్కింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లో మెంబర్ గా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఈయనకు అవకాశం దొరికింది. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విభాగం ఓ అనౌన్స్మెంట్ లో తెలిపింది. కాగా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్ పర్సన్గా నియమితులయ్యారు. ఆ కమిటీలో బాలశౌరి సభ్యుడిగా సేవలందించనున్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వ రెవెన్యూ, ఖర్చులను ఆడిట్ చేస్తుంది. ఇందులో అధికార పక్ష సభ్యులతో పాటు విపక్షాలకూ అవకాశం ఇస్తారు. లోక్ సభలో ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యా బలం ఆధారంగా ఈ నియామకాలు ఉంటాయి. కాంగ్రెస్, డీఎంకె తరువాత వైసీపీ కె ఎక్కువ మంది ఎంపీలు ప్రస్తుత లోక్ సభలో ఉన్నారు.
Next Story




