రేపు సౌదీ బస్సు ప్రమాద మృతులకు సామూహిక అంత్యక్రియలు

రేపు సౌదీ బస్సు ప్రమాద మృతులకు సామూహిక అంత్యక్రియలు
x
Highlights

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం ఘటనలో మృతి చెందిన 45 మంది హైదరాబాద్ యాత్రికులకు అక్కడే సామూహిక అంత్యక్రియలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని...

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం ఘటనలో మృతి చెందిన 45 మంది హైదరాబాద్ యాత్రికులకు అక్కడే సామూహిక అంత్యక్రియలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశాంగ శాఖ సమన్వయంతో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సౌదీ అరేబియాకు బయలుదేరింది. నాంపల్లి హజ్ హౌస్ నుంచి మృతుల కుటుంబ సభ్యులు 35 మందితో పాటు హజ్ కమిటీకి చెందిన ముగ్గురు సభ్యులు కలిపి మొత్తం 38 మందితో కూడిన బృందం విమానంలో బయలుదేరింది.

ఈ బృందం డీఎన్‌‌‌‌ఏ నమూనాల సేకరణ, మృతదేహాల గుర్తింపు, డెత్ సర్టిఫికెట్లు జారీ, సామూహిక అంత్యక్రియల ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. బస్సు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో డీఎన్‌‌‌‌ఏ పరీక్షల ద్వారానే డెడ్ బాడీల గుర్తింపు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. డీఎన్ఏ పరీక్షలకు కూడా ఆయా కుటుంబ సభ్యులకు సంబంధించిన పత్రాలు తప్పనిసరన్నారు. డీఎన్‌‌‌‌ఏ సరిపోలిక అనంతరం డెత్ సర్టిఫికెట్లు జారీ చేసి రేపు సామూహిక అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. మృతుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే అన్ని మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు జరుపనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories