ఆ మూడు షరతులకు ఒప్పుకుంటే.. అయోధ్య స్థలాన్ని వదులుకుంటాం! సున్నీ వక్ఫ్ బోర్డ్ కీలక ప్రతిపాదన!!

ఆ మూడు షరతులకు ఒప్పుకుంటే.. అయోధ్య స్థలాన్ని వదులుకుంటాం! సున్నీ వక్ఫ్ బోర్డ్ కీలక ప్రతిపాదన!!
x
Highlights

♦ అయోధ్యలోనే మరో చోట ఒక పెద్ద మసీదును కట్టుకునేందుకు అనుమతించాలి. ♦ దేశంలోని అన్ని మసీదులకు రక్షణ కల్పించాలి ♦ అయోధ్యలోని 22 పాత మసీదుల మరమ్మతులకు సహకరించాలి

అయోధ్య కేసు విషయంలో ఇక విచారించడానికి ఇంకేమీ లేదనీ, త్వరలోనే తుది తీర్పు వెల్లడిస్తామనీ సుప్రీం కోర్టు నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విషయంలో సుదీర్ఘంగా జరుగుతున్న విచారణ ప్రక్రియ దీంతో ఇక ముగిసినట్టే భావించవచ్చు.

ఈ కేసు విచారణ సందర్భంగా సున్నీ వక్ఫ్ బోర్డ్ మూడు షరతులతో కూడిన ఓ ప్రతిపాదన కోర్టు ముందు ఉంచినట్టు తెలుస్తోంది. దాని ప్రకారం

- బాబ్రీకి ప్రతిగా అయోధ్యలోనే మరో చోట ఒక పెద్ద మసీదును కట్టుకునేందుకు అనుమతించాలి.

- దేశంలో ఉన్న మసీదులన్నింటికీ రక్షణ కల్పించాలి. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. కబ్జాలు, విధ్వంసాలు జరగకుండా చూడాలి.

- అయోధ్యలో ఉన్న 22 పాత మసీదుల మరమ్మతులకు సహకారం అందించాలి. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న మసీదుల్లో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలి.

అనే మూడు షరతులు అంగీకరిస్తే.. మసీదు స్థలాన్ని వదిలేయడానికి తాము సిద్ధమని పేర్కొంది. కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్ బోర్డు ఈ సంచలన ప్రతిపాదన చేసింది. వివాదాస్పద స్థలంపై తమకున్న హక్కును వదులుకోవడానికి ఈ మూడు షరతుల తో తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

ఈ మేరకు వాదనల చివరి రోజున మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా తన ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు సున్నీ వక్ఫ్ బోర్డు పంపించింది. ఈ ప్రతిపాదనలపై సున్నీ వక్ఫ్ బోర్డుతో పాటు కొన్ని హిందూ పక్షాలు కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ సెటిల్మెంట్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories