Tamil Nadu: కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..అగ్నికి ఆహుతైన డ్రైవర్
* కారులోనే అగ్నికి ఆహుతైన డ్రైవర్ * దిండిగల్ - తిరుచ్చి జాతీయ రహదారిపై ప్రమాదం * కారు నెంబర్ ఆధారంగా మృతుని వివరాలపై ఆరా
కారు ఫైర్ ఆక్సిడెంట్ (ఫైల్ ఫోటో)
Tamil Nadu: కారులో మంటలు చెలరేగి ఓ డ్రైవర్ మృతిచెందిన ఘటన తమిళనాడులో జరిగింది. తిరుచ్చి జిల్లా మనప్పరాయి సమీపంలోని దిండిగల్ - తిరుచ్చి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న డ్రైవర్ తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో కారులోనే అగ్నికి ఆహుతయ్యాడు. మృతదేహాన్ని మనప్పరై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నంబర్ ఆధారంగా మృతుని వివరాలు సేకరిస్తున్నారు.
Next Story




