కరోనా వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్.. ప్రయోగాలు సక్సెస్..

కరోనా వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్.. ప్రయోగాలు సక్సెస్..
x
representative image
Highlights

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ కోసం శ్రమిస్తున్నాయి. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచలోనే పేరొందిన...

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ కోసం శ్రమిస్తున్నాయి. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచలోనే పేరొందిన ప్రముఖ సిరం ఇన్‌స్టిట్యూట్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తికి రెడీ అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ విడుదల అవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రస్తుతం ఈవ్యాక్సిన్‌ బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నది. ఇదే వ్యాక్సిన్ విజయవంతమైతే భారత్‌లో 6కోట్ల డోస్‌లను ఈ ఏడాది ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు 'సిరం' వివరించింది.

ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కోతులపై ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం మనుషులపై ప్రయోగాలు మొదలు పెడుతోంది. వచ్చే నెలాఖరకు మనుషులపై ప్రయోగ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ విజయవంతం కాగానే వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిరం ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటితో పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ కోసం కలిసి పనిచేస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ఎన్నో వ్యాక్సిన్‌లు తయారు చేసి ప్రపంచంలోనే సీరమ్ ఇనిస్టిట్యూట్‌ పేరొందింది. సెప్టెంబర్ నాటికి 60 మిలియన్ డోసులు రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదట దశలోనే భారతదేశ ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ధర వెయ్యి రూపాయిలు ఉండే చాన్స్‌లు ఎక్కువగా ఉంది. ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతో మంది అత్యున్నత స్థాయి నిపుణులు నిమగ్నమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి పరిశోధనలు జరుగుతుండగా వీటిలో ఇప్పటికే కనీసం ఐదు వ్యాక్సిన్లు పేజ్-1 క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నట్లు అంచనా వేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేపడుతున్న పరిశోధనలు సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది విజయవంతమై, అన్నీ సవ్యంగా జరిగితే మాత్రం రానున్న సంవత్సర కాలంలోనే దాదాపు 40 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

వ్యాక్సిన్లను భారత్ లోని పుణె కేంద్రంలో ఉన్న రెండు యూనిట్లలో తయారు చేయనున్నారు. ఒక్కో వ్యాక్సిన్ వెయ్యి రూపాయల ధరతో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం ఇది ఉచితంగానే ప్రభుత్వం అందజేసే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్ కోసం 600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిరం కంపెనీ బోర్డు ఈ మద్యే ఆమోదం తెలిపింది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories