జవాన్లతో కలిసి ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

జవాన్లతో కలిసి ప్రధాని మోడీ దీపావళి వేడుకలు
x
Highlights

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇల్లు వాడ దీపకాంతులతో ధగధగ లాడుతున్నాయి. బాణసంచాలు కాలుస్తూ సందడిగా పండుగ జరుపుకుంటున్నారు. దేశ...

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇల్లు వాడ దీపకాంతులతో ధగధగ లాడుతున్నాయి. బాణసంచాలు కాలుస్తూ సందడిగా పండుగ జరుపుకుంటున్నారు. దేశ సరిహద్దులో జవాన్లతో కలిసి ప్రధాని మోడీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సైనికులకు మోడీ మిఠాయిలు తినిపంచారు.

భారతదేశ ప్రధానమంత్రి నరేద్రమోదీ దీపావళి సంబరాలు భారత ఆర్మీతో కలిసి జరుపుకున్నారు. జమ్మూలోని రాజౌరీ ఆర్మీ క్యాంప్‌కు చేరుకున్న ప్రధాని ఆర్మీ యూనిఫాం ధరించి దివాళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని రాకతో జవాన్లంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని జవాన్లకు తానే స్వయంగా మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు సహా జవాన్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంవత్సరం దీపావళిని జవాన్లతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మోడీ. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని ఈ సందర్భంగా తెలిపారు. దేశ ప్రజలంతా పండుగను ఆనందంగా జరుపుకోవాలనీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తగా, పరిమితిగా టపాసులు కాల్చాలని ఆయన సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories