ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెంపు

Prime Minister Kisan Samman fund increase
x

Representational Image

Highlights

* రూ.6వేల ఆర్థిక సాయాన్ని రూ.10వేలకు పెంపు * వచ్చే బడ్జెట్‌లో ప్రకటించనున్న కేంద్రం

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సాయాన్ని పెంచనుంది. ప్రస్తుతం ఇస్తున్న 6వేల ఆర్థిక సాయంతో ప్రయోజనం చూకూరడం లేదని కేంద్రం భావిస్తుంది. 6 వేల సాయాన్ని 10 వేలకు పెంచేందుకు సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ వి‍షయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పీఎం-కిసాన్‌ సాయాన్ని రూ.10 వేలకు పెంచడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని కొంత చల్లార్చవచ్చనే అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కరోనా నేర్పిన పాఠంతో ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ దృక్పథంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories