పుట్టినరోజున సర్దార్ చెంత ప్రధాని మోడీ

పుట్టినరోజున సర్దార్ చెంత ప్రధాని మోడీ
x
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు 69వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా సొంతరాష్ట్రమైన గుజరాత్‌ వెళ్లిన మోదీ.. తన పుట్టినరోజున ఐక్యతావిగ్రహం సందర్శనతో పారంభించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు 69వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా సొంతరాష్ట్రమైన గుజరాత్‌ వెళ్లిన మోదీ.. తన పుట్టినరోజున ఐక్యతావిగ్రహం సందర్శనతో పారంభించారు. ఈ ఉదయం గాంధీనగర్ నుంచి కేవడియా వెళ్లిన ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. తరువాత జంగిల్‌ సఫారీ పార్క్‌ సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను సందర్శించారు. ఆయన వెంట గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తదితరులు ఉన్నారు. కేవడియా వెళ్లే మార్గంలో హెలికాష్టర్‌ నుంచే మోదీ ఐక్యతా విగ్రహాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను తన ట్విటర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ అందమైన ప్రదేశాన్ని మీరూ చూడాలంటూ ట్విటర్‌ ఫాలోవర్స్‌ను కోరారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories