భారత్ లో చిక్కుకున్న 400 మంది రష్యా పౌరుల తరలింపు

భారత్ లో చిక్కుకున్న 400 మంది రష్యా పౌరుల తరలింపు
x
Highlights

కరోనా మహమ్మారి కారణంగా బారతదేశంలో చిక్కుకున్న 400 మంది రష్యా పౌరులను బుధవారం ప్రత్యేక విమానంలో తిరిగి స్వదేశానికి తరలించినట్లు ఢిల్లీ లోని రష్యా ఉన్నత దౌత్యవేత్త తెలిపారు.

కరోనా మహమ్మారి కారణంగా బారతదేశం లో చిక్కుకున్న 400 మంది రష్యా పౌరులను బుధవారం ప్రత్యేక విమానంలో తిరిగి స్వదేశానికి తరలించినట్లు ఢిల్లీ లోని రష్యా ఉన్నత దౌత్యవేత్త తెలిపారు.వారికోసం ఏర్పాటు చేసిన నాల్గవ విమానం ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది.

"ఈ రోజు, మాస్కోకు బయలుదేరిన విమానంలో 400 మందికి పైగా రష్యన్ పౌరులు ఉన్నారు. మా స్వదేశీయులను ఇంటికి తీసుకురావడానికి నాల్గవ విమానమే. ఈ మిషన్‌కు అనేక ఏజెన్సీల తరపున అంకితభావం అవసరం" అని భారతదేశానికి రష్యా రాయబారి అయిన నికోలాయ్ ఒక ప్రకటనలో తెలిపారు .

"ఈ సవాలు సమయాల్లో దయగల మద్దతు మరియు నిస్వార్థ కృషికి" విదేశాంగ మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్థానిక పరిపాలన మరియు వివిధ రాష్ట్రాల పోలీసులకు ఆయన కృతజ్ఞతలు అంటూ ఆయన తెలిపారు. ఈ విమానాలను సిద్ధం చేసి సంస్థలను కూడా ఆయన ప్రశంసించారు.

"ఈ రోజు, రష్యా మరియు భారతదేశం రెండూ ఒకే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.. మన పౌరుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి, వీరిలో చాలామంది ఇంటికి దూరంగా ఉండి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు" అని నికోలాయ్ చెప్పారు. "మా నాయకులు, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంపై సానుకూల సంబంధాలు కలిగి ఉన్నారు" అని దౌత్యవేత్త తెలిపారు.

కాగా కరోనా మహమ్మారికి రష్యాలో ఇప్పటివరకు 2,337 కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి, అలాగే భారతదేశం 1,397 కేసులు మరియు 35 మరణాలను నమోదు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 41,000 మందికి పైగా ప్రాణాలు తీసింది. అంతేకాదు దాదాపు 9 లక్షల కేసులను కూడా కలిగివుంది. కరోనా మహమ్మారికి అగ్రరాజ్యం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక్కడ దాదాపుగా లక్షా 60 వేల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్యలో కూడా చైనాను మించిపోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories