బిహార్ ప్రజలకు నితీష్ షాక్ ఆఫర్.. 125 యూనిట్ల ఉచిత విద్యుత్ – అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక ప్రకటన!

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల ముందు కీలకంగా 125 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే నిర్ణయం తీసుకున్నారు. ఈ షాక్ ఆఫర్‌తో రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

Vineela Sekhar
Published on: 17 July 2025 3:43 PM IST
బిహార్ ప్రజలకు నితీష్ షాక్ ఆఫర్.. 125 యూనిట్ల ఉచిత విద్యుత్ – అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక ప్రకటన!
X

Nitish Kumar’s Shocking Offer to Bihar: 125 Units of Free Electricity Ahead of Assembly Elections!

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక అనూహ్య ప్రకటన చేశారు. 2025 అక్టోబర్/నవంబర్‌లో జరిగే అవకాశం ఉన్న ఎన్నికల ముందు ప్రజల మద్దతు సాధించేందుకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి గృహ వినియోగదారులకు ఈ నూతన పథకం అమలులోకి రానుంది. ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాలలో హీట్ పెరిగింది.

CM నితీష్ కుమార్ అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటిస్తూ, "ప్రతి గృహ వినియోగదారు 125 యూనిట్ల వరకు విద్యుత్‌కు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు" అని తెలిపారు. ఇది జూలై నెల విద్యుత్ బిల్లుపై నుంచి వర్తించనుంది.

బిహార్‌లో ఈ కొత్త పథకం వల్ల దాదాపు 1.67 కోట్ల కుటుంబాలకు లాభం కలిగే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. విద్యుత్ ఖర్చులు చాలా కుటుంబాల ప్రధాన భారంగా ఉన్న సమయంలో ఉచిత విద్యుత్ ఒక ఊరటగా మారింది.

సౌర విద్యుత్ లక్ష్యాలు:

బిహార్ ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పేదలకు ఉన్న 'కుటీర్ జ్యోతి యోజన' కింద వారి ఇళ్లపై లేదా సమీప ప్రభుత్వ స్థలాల్లో సోలార్ పవర్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయనుంది. పేదలకు ఖర్చును పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన వర్గాలకు తగినంత సబ్సిడీ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని CM నితీష్ కుమార్ వెల్లడించారు.

రాజకీయ ప్రభావం:

బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఉచిత విద్యుత్ పథకం వల్ల CM నితీష్ కుమార్ నేతృత్వంలోని JDU-BJP కూటమికి ప్రజా మద్దతు పెరగొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Vineela Sekhar

Vineela Sekhar

Next Story