చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం!

చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం!
x
Highlights

చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను దారుణంగా హత్య చేశారు. అక్కడే ఉన్న మూడు వాహనాలకు నిప్పటించారు.

చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను దారుణంగా హత్య చేశారు. అక్కడే ఉన్న మూడు వాహనాలకు నిప్పటించారు. ఘటన స్థలానికి మావోయిస్టులు భారీ సంఖ్యలో వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల కాల్పులతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories