Karnataka: మాజీ ప్రేయసిపై యువకుడు దాడి

Karnataka: మాజీ ప్రేయసిపై యువకుడు దాడి
x
Representational Image
Highlights

మాజీ ప్రేయసిపై ఓ యువకుడు దాడిచేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. నెలమంగల సోలదేనహళ్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన 21 సంవత్సరాల యువతి.....

మాజీ ప్రేయసిపై ఓ యువకుడు దాడిచేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. నెలమంగల సోలదేనహళ్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన 21 సంవత్సరాల యువతి.. బబిత్‌ అనే యువకునితో 4 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించింది. అయితే వారిధ్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆ యువతికి మరొక యువకునితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ విషయం బబిత్ తెలిసి ఆమెతో గొడవపడ్డాడు. అయితే ఆమె తామిద్దరం విడిపోయాక తననెందుకు పట్టించుకుంటున్నావని సమాధానం ఇచ్చింది. దాంతో లైట్ తీసుకున్న బబిత్ కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్నాడు. ఈ క్రమంలో రాహుల్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

అది ప్రేమకు దారితీసింది. యువతి కొత్త ప్రియుడి ఇంట్లో ఉండగా హఠాత్తుగా అక్కడకు వచ్చిన మాజీ ప్రియుడు యువతిపై తీవ్రంగా దాడి చేశాడు. హెల్మెట్‌తో తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె సృహతప్పి పడిపోయింది. సదరు యువతి ఇంటికి ఫోన్‌ చేసి మీ కుమార్తెకు యాక్సిడెంట్‌ జరిగిందని చెప్పడం తోపాటు యువతిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత యువతి తల్లిదండ్రులకు అసలు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కొత్త, పాత ప్రియుడు ఇద్దరూ స్నేహితులని, కొత్త ప్రియుడు సమాచారం ఇవ్వడంతోనే మాజీ ప్రియుడు వచ్చి దాడి చేశాడని విచారణలో తెలిసింది. అంతేకాదు ముగ్గురూ ఒకే కాలనీలో నివాసం ఉంటున్నారు. దీంతో సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదుచేసుకుని బబిత్, రాహుల్‌ ఇద్దరినీ అరెస్టు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories