Janata Curfew Live Updates : కరోనా వైరస్ పై యద్ధం!

Live Updates

  • 22 March 2020 1:51 AM GMT

    ఆంద్ర ప్రదేశ్ లో ఉదయం ఆరు గంటల నుంచే అన్నీ బంద్!

    - ఆంద్ర ప్రదేశ్ లో విజయవాడతో పాటూ మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఉదయం ఆరు గంటల నుంచే జనతా కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది.

    - అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

    - నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా శనివారమే ప్రజలు ముందుగానే తగినట్లు ఏర్పాట్లు చేసుకున్నారు.

    - కరోనా పై భయం కాదు అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. 



  • 22 March 2020 1:45 AM GMT

    తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా!

    - తెలంగాణాలో జనతా కర్ఫ్యూ 24 గంటల పాటు నిర్వహిస్తామనీ, సోమవారం ఉదయం 6 గంటల వరకూ ప్రజలేవరూ బయటకు రావద్దనీ సిఎం కేసీఆర్ సూచించారు.

    - ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడితే అన్నీ మూసివేసి, 15 రోజులకు సరిపడా రేషన్‌ సరకులు ఇంటింటికీ పంపుతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

    - తాను బతికుండగా ప్రజలు నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రానివ్వబోని అయన అన్నారు.

    - అవసరమైతే రూ. పది వేల కోట్ల వరకైనా వెచ్చిస్తానని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

  • 22 March 2020 1:38 AM GMT

    కరోనా వైరస్ ప్రభావం దేశంలో మహారాష్ట్రలో తీవ్రంగా ఉంది . దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. వైరస్‌ బాధితుల సంఖ్య ఇక్కడ 63కు చేరింది. మహారాష్ట్రలో కరోనా స్టేజ్‌3 దిశగా పయనిస్తోందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే ప్రకటించారు. 

Print Article
More On
Next Story
More Stories