Live Updates
- 22 March 2020 1:51 AM GMT
ఆంద్ర ప్రదేశ్ లో ఉదయం ఆరు గంటల నుంచే అన్నీ బంద్!
- ఆంద్ర ప్రదేశ్ లో విజయవాడతో పాటూ మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఉదయం ఆరు గంటల నుంచే జనతా కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది.
- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
- నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా శనివారమే ప్రజలు ముందుగానే తగినట్లు ఏర్పాట్లు చేసుకున్నారు.
- కరోనా పై భయం కాదు అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
నిత్యావసరాల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దు. అన్ని సరుకులూ యధావిధిగానే షాపుల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాలు ధరలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాయి. కరోనా పేరుతో నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం- సీఎం వైయస్ జగన్ pic.twitter.com/XQhOGOfjDS
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 21, 2020 - 22 March 2020 1:45 AM GMT
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా!
- తెలంగాణాలో జనతా కర్ఫ్యూ 24 గంటల పాటు నిర్వహిస్తామనీ, సోమవారం ఉదయం 6 గంటల వరకూ ప్రజలేవరూ బయటకు రావద్దనీ సిఎం కేసీఆర్ సూచించారు.
- ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడితే అన్నీ మూసివేసి, 15 రోజులకు సరిపడా రేషన్ సరకులు ఇంటింటికీ పంపుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
- తాను బతికుండగా ప్రజలు నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రానివ్వబోని అయన అన్నారు.
- అవసరమైతే రూ. పది వేల కోట్ల వరకైనా వెచ్చిస్తానని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
- 22 March 2020 1:38 AM GMT
కరోనా వైరస్ ప్రభావం దేశంలో మహారాష్ట్రలో తీవ్రంగా ఉంది . దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. వైరస్ బాధితుల సంఖ్య ఇక్కడ 63కు చేరింది. మహారాష్ట్రలో కరోనా స్టేజ్3 దిశగా పయనిస్తోందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire