India china Lashes: డ్రాగన్‌ దేశాన్ని షాకిచ్చిన భారత్.. ఆ దేశ సంస్థలన్ని బహిష్కరణ

India china Lashes: డ్రాగన్‌ దేశాన్ని షాకిచ్చిన భారత్.. ఆ దేశ సంస్థలన్ని బహిష్కరణ
x
Highlights

India china Lashes: సరిహద్దుల్లోని గల్వాన్‌ వద్ద జూన్ 15 జరిగిన ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరు పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

India china Lashes: సరిహద్దుల్లోని గల్వాన్‌ వద్ద జూన్ 15 జరిగిన ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరు పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్రం చైనా దేశానికి చెందిన పలు యాప్‌లపై నిషేదం విధించింది. దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. భారత మరోసారి చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. డ్రాగన్‌ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు భారత్ పావులు కదుపుతోంది.

చైనాను బహిష్కరించడానికి హైవే నిర్మాణం, పారిశ్రామిక, టెలికాం, రైల్వే రంగాల్లోనూ సన్నద్ధమైంది. ఈ క్రమంలో కేంద్ర రహదారులు, హైవే శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. భారత్‌లో హైవే నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలతో పాటు, ఆ దేశ సంస్థల భాగస్వామ్యం ఉన్న జాయింట్‌ వెంచర్స్‌ కూడా అనుమతించకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

నేషనల్ హైవే నిర్మాణ పనులను స్వదేశీ సంస్థలు చేజిక్కించుకునేందుకు వీలుగా అర్హత ప్రక్రియను సులభతరం చేయనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులు అలాగే కొత్త టెండర్లలోనూ చైనా సంస్థలను భాగస్వామ్యం ఉన్న వాటిని నిషేధిస్తామని, అవసరమైతే కొత్త టెండర్లను ఆహ్వానిస్తామని ప్రకటించారు. కాగా.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో(MSME)లో చైనా సంస్థల భాగస్వామ్యనికి తెర దించే చర్యలు తీసుకోనున్నట్లు గడ్కరీ స్పష్టం చేశారు. స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తూనే విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చైనాకు మాత్రం అనుమతిలేదని పేర్కొన్నారు.

ఇక చైనా సంస్థలను దూరం పెట్టేందుకే టెలికాం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌(BSNL) 4జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రాజెక్టు చైనాకు కేటాయించిన టెండర్లను రద్దు చేసింది. 4జీ ప్రాజెక్టులో చైనా సంస్థల ఉత్పత్తులను వాడొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. సుమారు 8 వేల కోట్ల రూపాయలు విలువైన ఈ ప్రాజెక్టు కోసం 2 వారాల్లో మళ్లీ కొత్త టెండర్లను పిలవనున్నట్లు తెలిసింది. ఇప్పటివరకూ భారత టెలికాం వ్యాపారంలో సుమారు 75 శాతం చైనాకు చెందిన హవేయ్‌ టెక్నాలజీస్‌, జెడ్‌టీఈ కార్పొరేషన్‌ సంస్థలదే. తాజాగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో వాటి ఆధిపత్యానికి గండి పడనుంది.

మరోవైపు రైల్వే శాఖ కూడా చైనా సంస్థకు షాక్ ఇచ్చింది. ఆ దేశ సంస్ధలకు ప్రయోజనం కల్పించేలా... ఉన్న కారణంతో రైల్వే ఓ టెండరును రద్దు చేసింది. వ్యక్తుల శరీర ఉష్ణోగత్రను కొలవడంతో పాటు మాస్కు ధరించని 800 థర్మల్‌ కెమెరాల కోసం గత నెలలో రైల్వే టెండర్లను ఆహ్వానించింది. అయితే అందులో పేర్కొన్న ఒక నిబంధన చైనాకు చెందిన ప్రముఖ సీసీ కెమెరాల సంస్థ హిక్‌విజన్‌కు అనుకూలంగా ఉందంటూ కొన్ని సంస్థలు రైల్వేకు ఫిర్యాదు చేశాయి. అందుకే ఆ టెండరును రద్దు చేసినట్లు తెలుస్తోంది. భారత్ డ్రాగన్ కంట్రీకి గుణపాఠం చెప్పేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories