Heavy Rains in Odisha: ఒడిశాలో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి..

Heavy Rains in Odisha: ఒడిశాలో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి..
x

Heavy Rains in Odisha

Highlights

Heavy Rains in Odisha: ఒడిశాలో కుండపోత వర్షాలకు నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

Heavy Rains in Odisha: ఒడిశాలో కుండపోత వర్షాలకు నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.అనేక జిల్లలో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేల మంది పునరావాస కేంద్రాలకు తరలించారు. బెంగాల్ బెంగాల్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 6 జిల్లాల్లో సగటున 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.

అయితే, భారీ వర్షం కారణంగా దాదాపు అన్ని బ్లాక్‌లు ప్రభావితమయ్యాయి, వ్యవసాయ భూముల విస్తారమైన పాచెస్ మునిగిపోయాయి. అధికారులు మునిగిపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేస్తున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఒడిఆర్‌ఎఫ్, అగ్నిమాపక సేవలు మోహరించబడ్డాయి. భారీ వర్షపాతం, వరదలు కారణంగా ఒడిశాలో గత 3 రోజుల్లో 7 మంది మరణించగా, 2 మంది తప్పిపోయినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా గురువారం తెలిపారు.

బంగాళాకతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులు అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాసం ఉంది వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సుందర్ఘర్, సంబల్పూర్, సోనేపూర్, బోలంగీర్, జార్సుగూడ, వంటి ప్రాంతాలలో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేసారు. పూరి, ఖుర్దా, అంగుల్, నువాపాడా, నబరంగ్‌పూర్, కియోన్‌జార్, ధెంకనాల్, మయూరభంజ్, కంధమాల్ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జరీ చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories