Tamil Nadu: ఏనుగు బీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి, ముగ్గురికి గాయాలు

Elephant Created Havoc in Tamil Nadu
x

Tamil Nadu: ఏనుగు బీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి, ముగ్గురికి గాయాలు

Highlights

Tamil Nadu: ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తుల నిరసన

Tamil Nadu: తమిళనాడులో ఏనుగు బీభత్సం సృష్టించింది. కృష్ణగిరి హోసూరు సమీపంలో పొలం వద్దకు వెళ్తున్న రైతులపై ఒంటరి ఏనుగు దాడి చేసి ఇద్దరు మహిళలను చంపేసింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. ఫారెస్ట్‌ అధికారి కార్యాలయం దగ్గర గ్రామస్తులు నిరసన చేపట్టారు. కొంతకాలంగా ఏనుగుల దాడిపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా.. చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories