Covishield Cost: కొవిషీల్డ్‌ వాక్సిన్ ధర ఎంతో తెలుసా!

Covishield Cost: కొవిషీల్డ్‌ వాక్సిన్ ధర ఎంతో తెలుసా!
x

కోవిషీల్డ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Covishield Cost: రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున టీకాను విక్రయిస్తామని వెల్లడించింది.

Covishield Cost: పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొవిషీల్డ్‌ ధరలను ప్రకటించింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలు కల్పించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. ప్రైవేటు మార్కెట్లో కొవిషీల్డ్‌ టీకాల ధరలను బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున టీకాను విక్రయిస్తామని వెల్లడించింది.వచ్చే నెలలో భారీ ఎత్తున కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తామని సీరం సంస్థ సీఈవో వెల్లడించారు. ప్రపంచంలో అతి తక్కువ ధరకు కొవిషీల్డ్‌ లభ్యమవుతుంది. డబుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌పై కోవాగ్జిన్‌ సమర్ధవంతంగా పనిచేస్తుందని అన్నిరకాల స్ట్రెయిన్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనే కెపాసిటీ కోవాగ్జిన్‌కు ఉందని ఐసీఎమ్‌ఆర్‌ ప్రకటించింది.

''కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఉత్పత్తిలో 50శాతం కేంద్రానికి, 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అందజేయనున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయిస్తాం. విదేశీ టీకాలతో పోలిస్తే మా వ్యాక్సిన్‌ ధరలు అందుబాటులోనే ఉన్నాయి'' అని సీరమ్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే రెండు నెలల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచి కొరతను అధిగమిస్తామని సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. 4, 5 నెలల తర్వాత రిటైల్‌ మార్కెట్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్లను విక్రయించి రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. టీకా తయారీదారులు... 50% ఉత్పత్తిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడానికి, నిర్ణీత ధరలకు బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవడానికి కేంద్రం అంగీకరించింది. అదనపు డోసులు కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్‌ తయారీ సంస్థల నుంచి సేకరించుకునే స్వేచ్ఛ కల్పించింది. అయితే ఈ విధానం వల్ల రాష్ట్రాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నారు.

మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అసలే కరోనాతో ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయింది. దీనితో చాల మంది ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. ఈ నేథప్యంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కరోనా మహమ్మారికి వేసే టీకాలకు ధర నిర్ణయించడంపై కొంతమంది సామాజిక వేత్తలు పెదవి విరుస్తున్నారు. మన దేశంలో విజృంభిస్తుంటే వ్యాక్సిన్ల ను ఇతర దేశాలకు పంపిణీ చేసి, ఇక్కడ ధరలు నిర్ణయించడం పై మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories