Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 65,002 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 15 Aug 2020 10:00 AM IST
Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 65,002 కరోనా పాజిటివ్ కేసులు
X

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 25 లక్షల 26 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 65,002 కేసులు నమోదు కాగా, 996 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 57,381 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 25,26,192 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,68,220 ఉండగా, 18,08,936 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 49,036 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 71.77 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.95 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 26.88 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో 8,68,679 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 2,85,63,095కి చేరింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story