క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి సమష్టిగా కృషి చేయాలి- మల్లికార్జున ఖర్గే

Coronavirus: దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే.

Arun Chilukuri
Updated on: 10 May 2021 12:51 PM IST
Coronavirus: Mallikarjun Kharge writes to PM Modi, offers 6 Suggestions
X

క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి సమష్టిగా కృషి చేయాలి - మల్లికార్జున ఖర్గే

Coronavirus: దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. పరిస్థితిని అదుపు చేయడానికి ఆరు సలహాలను కూడా అందులో పేర్కొన్నారు. అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బడ్జెట్​లో టీకాలకు 35వేల కోట్లను కేంద్రం కేటాయించినప్పటికీ టీకా ధర నిర్ణయం ప్రైవేటు సంస్థలకు వదిలేసిందని విమర్శించారు. అలాగే టీకాల కొనుగోలు రాష్ట్రాలకు అప్పజెప్పడం ద్వారా ప్రజల పట్ల కేంద్రం తన బాధ్యతను విరమించుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story