కరోనా ఎఫెక్ట్ ... స్పీడ్ పోస్టులో మంగళసూత్రం.. జూమ్ కాల్ లో వివాహ బంధం

కరోనా ఎఫెక్ట్ ... స్పీడ్ పోస్టులో మంగళసూత్రం.. జూమ్ కాల్ లో వివాహ బంధం
x
Highlights

కరోనా వేళ లాక్ డౌన్ నిభందనలను బేఖాతరు చేసి, కొంతమంది ఎక్కువ మంది జనాలతో వేడుక చేసి జైలు పాలవుతుండగా, మరికొంత మంది ప్రభుత్వ నిభందనలు తూ.చ తప్పకుండా...

కరోనా వేళ లాక్ డౌన్ నిభందనలను బేఖాతరు చేసి, కొంతమంది ఎక్కువ మంది జనాలతో వేడుక చేసి జైలు పాలవుతుండగా, మరికొంత మంది ప్రభుత్వ నిభందనలు తూ.చ తప్పకుండా పాటిస్తూ కొత్త వరవడి సృష్టిస్తున్నారు. ఇదే తరహాలో కేరళకు చెందిన ఒక జంట స్పీడ్ పోస్తులో మంగళ సూత్రం రప్పించుకుని, కేవలం పరిమితమైన స్నేహితుల మధ్య వివాహాన్ని జరుపుకున్నారు. అయితే ఈ వేడుకను చూసే అవకాశాన్ని తమ కుటుంబం సభ్యులు, బంధువులకు జూమ్ వీడియో ద్వారా కలుగజేశారు.

కేరళకు చెందిన ఓ కపుల్.. తమ పెళ్లిని వెరైటీగా జరుపుకున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉండగా తాము అనుకున్న తేదీకే ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. విఘ్నేష్, అంజలి రంజిత్ అనే ఈ జంట జూమ్ కాల్ ద్వారా ఒకింటివారయ్యారు. పుణేలో జాబ్ చేస్తున్న వీరు లాక్ డౌన్ కారణంగా కేరళ వెళ్లలేకపోవడంతో.. పుణెలోనే వివాహమాడారు. ప్రపంచ వ్యాప్తంగా వందమంది గెస్టులను ఈ కాల్ ద్వారా ఈ జంట ఆహ్వానించిందట. పెళ్ళికొడుకు విఘ్నేష్ ఫ్లాట్ లో అతని స్నేహితులు పూలదండలు, బొకేలు అందిస్తుండగా వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు.

ఓ తమిళ మూవీ లోని' మాంగల్యం తంతునామేనా' అనే మంత్రాలను వీడియో ద్వారా వింటూ ఈ కపుల్ పెళ్లి చేసుకోవడం విశేషం. పైగా పెళ్ళికూతురికి ఆమె తలిదండ్రులు స్పీడ్ పోస్ట్ ద్వారా మంగళసూత్రాన్ని పంపారట, లాక్ డౌన్ నిబంధనలను కాస్త సడలించడంతో.. ఈ 'తాళి' సకాలంలో వీరికి చేరింది. ఇందుకు స్పీడ్ పోస్టును కొత్త జంట అభినందించింది. వధూవరుల తలిదండ్రులు కూడా జూమ్ కాల్ ద్వారానే ఈ వివాహాన్ని వీక్షించి ఆశీస్సులు అందజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories