Coronavirus: భారత్ లో వెయ్యికి చేరువగా కరోనా వైరస్ కేసులు

Coronavirus: భారత్ లో వెయ్యికి చేరువగా కరోనా వైరస్  కేసులు
x
Highlights

భారత్ లో కరోనా మహమ్మారి గుబులు ఎక్కువైతోంది. వైరస్ కేసుల సంఖ్య రోజుకో విధంగా పెరుగుతూ పోతోంది.

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి గుబులు ఎక్కువైతోంది. వైరస్ కేసుల సంఖ్య రోజుకో విధంగా పెరుగుతూ పోతోంది. వెయ్యికి చేరువగా ఉంది. ప్రస్తుతం భారత్ లో 918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఇందులో 47 మంది విదేశీయులు ఉన్నారు. అలాగే 40 మందికి పైగా కోలుకున్నారు. ఇందులో కొంతమందిని డిశ్చార్జ్ చేశారు. ఇండియాలో పాజిటివ్ కేసులు నమోదైన వారిలో ఇందులో సింహభాగం విదేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. అయితే ఒకరిద్దరి మాత్రం వారి ద్వారా సంక్రమించింది. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 180 కరోనా కేసులుతో మొదటి స్థానంలో ఉండగా.. 173 కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది.

అలాగే తెలంగాణలో 63, కర్ణాటకలో 55, రాజస్తాన్‌లో 48, గుజరాత్‌లో 48, ఉత్తరప్రదేశ్‌లో 45, ఢిల్లీలో 39, పంజాబ్‌లో 38, తమిళనాడులో 38, హరియాణాలో 33, మధ్యప్రదేశ్‌లో 30, జమ్మూకశ్మీర్‌లో 18, పశ్చిమబెంగాల్‌లో 15, ఆంధ్రప్రదేశ్‌లో 19, లదాఖ్‌లో 13, బిహార్‌లో 9, చండీగఢ్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, హిమాచల్‌ ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, గోవాలో 3, మణిపూర్‌లో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, మిజోరాంలో ఒకటి, అండమాన్‌ దీవుల్లో 2 కేసులు నమోదయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories