Building Collapse in Raigarh: మహారాష్ట్రలో ఘోర విషాదం.. కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 50 మంది!

Building Collapse in Raigarh: మహారాష్ట్రలో ఘోర విషాదం..   కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 50 మంది!
x
Highlights

Building Collapse in Raigarh: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మహద్‌ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.

Building Collapse in Raigarh: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మహద్‌ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 15మంది గాయపడగా.. దాదాపు 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంట‌నే రంగంలోకి దిగి స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించాయి. మారో మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించినట్టు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా వెల్లడికావాల్సి వుంది.

ఈ భవనం పదేళ్ల క్రితం నాటిది. 40 అపార్ట్‌మెంట్‌లున్నాయి. సాయంత్రం ఆరు గంటల సమయంలో కుప్పకూలిందని పోలీస్ అధికారులు తెలిపారు. కూలిపోయే సమయంలో చాలామంది బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. శిథిలాల కింద 50మందికి పైగా చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. స‌హాయ‌క చర్య‌ల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories