BJP Manifesto: సార్వత్రిక ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

BJP Manifesto Released
x

BJP Manifesto: సార్వత్రిక ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Highlights

BJP Manifesto: 14 కీలక అంశాలతో మ్యానిఫెస్టో విడుదల

BJP Manifesto: సార్వత్రిక ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ దీన్ని ఆవిష్కరించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో మ్యానిఫెస్టోను రూపొందించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలను పరిశీలించింది. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా దీనిని రూపొందించారు. ఈ మేనిఫెస్టోలో 14 కీలక అంశాలను చేర్చారు. అందులో విశ్వబంధు, సురక్షిత భారత్‌, సమృద్ధ భారత్‌, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్‌, అత్యుత్తమ శిక్షణ, క్రీడావికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్‌ ఉన్నాయి.

బీజేపీ మ్యానిఫెస్టోలోని కీలక అంశాలు పరిశీలిస్తే.. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ మ్యానిఫెస్టో రూపొందించారని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నారు. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణంతో పాటు..మరో ఐదేళ్లు ఉచిత రేషన్‌, పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ వంటగ్యాస్‌, ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు, దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్‌ భారత్‌ వర్తించేలా నిర్ణయం తీసుకోనున్నారు. వృద్ధుల కోసం ఆయుష్‌ శిబిరాల నిర్వహణ, పుణ్యక్షేత్రాల పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకు చేయూత ఇవ్వనున్నారు. మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళికలను రూపొందించనున్నారు. పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్తును అందించనున్నారు. డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంచాలని బీజేపీ మ్యానిఫెస్టో నిర్ణయం తీసుకుంది. కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం ప్రత్యేక క్లస్టర్లు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం,చిన్న రైతుల లబ్ధి కోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహం, ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంపు, వ్యవసాయ మౌలికవసతుల మిషన్‌ ప్రారంభం, వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహం ఏర్పాటు తదితర నిర్ణయాలను బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్‌ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది బీజేపీ మ్యానిఫెస్టో. తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి,ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కొత్త శాటిలైట్‌ పట్టణాల ఏర్పాటు చేయనున్నారు. విమానయాన రంగానికి ఊతమివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్తు వాహన రంగానికి ప్రోత్సాహం ఇవ్వనున్నారు. వందేభారత్‌ విస్తరణతో పాటు...

దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. రక్షణ, వంటనూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహాలు ప్రకటించారు. విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ ఇచ్చారు. ఇలా అన్నిరంగాల అభివృద్ధికి బీజేపీ మ్యానిఫెస్టోలో చోటు లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories