పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 52 లక్షల దోపిడీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 52 లక్షల దోపిడీ
x
Highlights

రాజధాని పాట్నాలోని బ్యూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 52 లక్షల 33 వేల 500 రూపాయలను నేరస్థులు దోచుకున్నారు.

రాజధాని పాట్నాబ్యూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 52 లక్షల 33 వేల 500 రూపాయలను నేరస్థులు దోచుకున్నారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో జరిగింది. పాట్నాకు చెందిన బైక్ రైడింగ్ దొంగలు ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. సుమారు 8 నుంచి 10 మంది వచ్చి బ్యాంక్ మేనేజర్‌ను,

ఇతర సిబ్బందిని బందీలుగా చేసి దోపిడీకి పాల్పడ్డారు. నేరస్థులు డబ్బు తీసుకొని పారిపోయిన తరువాత బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా బ్యాంకు దొంగలు ముందుగా గార్డులను కొట్టినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు సమగ్ర సమాచారం కోసం దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సిసిటివి ఫుటేజీని హార్డ్ డిస్క్ లో సేకరించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories