ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం

Arun Chilukuri
Published on: 6 Oct 2020 2:51 PM IST
ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
X

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు బలమైన వాదనలను వినిపించాయి.

ప్రధానంగా పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచడం వంటి అంశాలపై తెలంగాణ అభ్యంతరాలను లేవనెత్తింది. అయితే తాము కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నిబంధనల మేరకే పోతిరెడ్డి సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలిపింది. మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామని, దీనిపై అభ్యంతరం ఎందుకని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్‌ నుంచి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీలోని సీఎం అధికారిక నివాసం 1-జన్‌పథ్‌ నుంచి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story