రాజస్థాన్ లో కూలిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌

Air Forces Fighter Jet Crashes In Rajasthans Barmer
x

రాజస్థాన్ లో కూలిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌

Highlights

Air Force's Fighter Jet Crash: ఇద్దరు పైలట్లు మృతి

Air Force's Fighter Jet Crash: భారత వాయుసేనకు చెందిన శిక్షణ యుద్ద విమానం మిగ్-21 రాజస్థాన్ లోని బార్మార్ జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. బిమ్రా సమీపంలో ఘటన జరిగినట్లు భారత వైమానిక దళం వెల్లడించింది. విమానం కూలిన సమయంలో పెద్ద ఎత్తున మటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదంపై భారత వాయుసేన అధిపతి మార్షల్ వీఆర్ చౌదరితో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించడం పట్ల భారత వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories