Maharashtra: మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగి సాహసం

A Railway Employee Rescues a Child who Fell on a Railway Track in Maharashtra
x

బాలున్ని కాపాడిన రైల్వే ఉద్యోగి (ఫైల్ ఇమేజ్)

Highlights

Maharashtra: ట్రాక్‌పై పడిన చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగి * అదుపుతప్పి ట్రాక్‌పై పడిన బాలుడు

Maharashtra: అదుపుతప్పి ట్రాక్‌పై పడిన బాలుడు.. అదే సమయానికి ఎదురుగా రైలు.. పక్కనే ఉన్నా ఏం చేయాలో తెలియని స్థితిలో తల్లి.. అదే టైమ్‌లో రైలుకు ఎదురుగా వెళ్లాడో రియల్ హీరో. తన ప్రాణాలకు తెగించి సాహసంతో ఆ బాలుడి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని వంగాణి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

వంగాణి స్టేషన్‌ రెండో ప్లాట్‌ఫామ్‌పై తల్లీకొడుకులిద్దరూ ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్లారు. సడన్‌గా బాలుడు ప్లాట్‌ఫామ్‌ నుంచి అదుపుతప్పి కిందపడిపోయాడు. సరిగా అదే సమయంలో ఆ ప్లాట్‌ఫామ్‌పైకి ఓ రైలు దూసుకొచ్చింది. దాంతో వెంటనే స్పందించిన పాయింట్స్‌మెన్‌ బాలుడిని సాహసోపేతంగా రక్షించాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. సీసీటీవీలో రికార్డైన్ ఈ దృశ్యాలను సెంట్రల్ రైల్వే అధికారులు విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories