Independence Day 2020: కరోనాపై మోదీ శుభవార్త.. త్వరలో..

Independence Day 2020: కరోనాపై మోదీ శుభవార్త.. త్వరలో..
x
Highlights

Independence Day 2020: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటలో కరోనా వ్యాక్సిన్‌ గురించి ప్రధాని మోడీ పలు కీలక విషయాలు...

Independence Day 2020: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటలో కరోనా వ్యాక్సిన్‌ గురించి ప్రధాని మోడీ పలు కీలక విషయాలు మాట్లాడారు. కరోనా వైరస్ నివారణకు సంబంధించి ఇండియాలో మూడు వ్యాక్సిన్లు వివిధ దశల పరీక్షల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు ఆమోదం, అనుమతి లభించిన వెంటనే ప్రతి భారతీయుడికి లభించేలా ఉత్పత్తి, పంపిణీ ప్రణాళికతో ఉన్నామనీ, దానికోసం రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నానంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ దేశ ప్రజలకు ఈ శుభవార్త అందించారు. కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192 చేరింది. మరోవైపు మరణాల సంఖ్య 50 వేలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories