Tollywood Director Satish Vegeshna: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న దర్శకుడి కొడుకు!

Tollywood Director Satish Vegeshna: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న దర్శకుడి కొడుకు!
x
Highlights

Tollywood Director Satish Vegeshna: తెలుగు సినీ ఇండస్ట్రీలో వారుసుల సినీ రంగ ప్రవేశం అనేది కొత్తేమి కాదు..

Tollywood Director Satish Vegeshna: తెలుగు సినీ ఇండస్ట్రీలో వారుసుల సినీ రంగ ప్రవేశం అనేది కొత్తేమి కాదు.. చాలా మంది హీరోలు, దర్శకులు తమ కొడుకులను హీరోలను చేశారు. అయితే ఇందులో కొందరు సక్సెస్ అయి తమ సినీ జర్నీని కొనసాగిస్తుంటే మరికొందరు మాత్రం కనుమరుగు అయిపోయారు. అయితే ఇప్పుడు ఓ డైరెక్టర్ తన కొడుకును హీరోగా పరిచయం చేయాలనీ అనుకుంటున్నాడు. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఫ్యామిలీ డైరెక్టర్ సతీష్‌ వేగెశ్న..

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన దొంగలబండి సినిమాతో దర్శకుడిగా మారాడు సతీష్‌ వేగెశ్న.. ఆ తరవాత అవకాశాలు అంతక రాకపోవడంతో హరీష్ శంకర్ దగ్గర స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేశాడు. ఆ తర్వాత నిర్మాత దిల్ రాజుతో మంది బంధం ఏర్పడడంతో 'శతమానం భవతి', శ్రీనివాస కల్యాణం' సినిమాలను తెరకెక్కించాడు. ఇందులో శతమానం భవతి మంచి హిట్ అయి సతీష్‌ వేగెశ్నకి ఫ్యామిలీ డైరెక్టర్ అన్న పేరు కూడా వచ్చింది.

ఇక తాజాగా సంక్రాతి కానుకగా వచ్చిన ఎంత మంచివాడవురా చిత్రం పరాజయం కావడంతో ఏ హీరో సతీష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించలేదు.. ప్రస్తుతం సతీష్‌ వేగెశ్న అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న నాంది అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే సతీష్‌ వేగెశ్న తన కొడుకుని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనీ అనుకుంటున్నాడట.. తన సొంత బ్యానర్‌లోనే, స్వీయ దర్శకత్వంలోనే సతీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. దీనిపైన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories