మీకు మాత్రమే చెప్తా!

మీకు మాత్రమే చెప్తా!
x
Highlights

'పెళ్లిచూపులు' అనే సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ ను కూడా పరిచయం చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్...

'పెళ్లిచూపులు' అనే సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ ను కూడా పరిచయం చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాలో నటించిన అందరూ ఇండస్ట్రీలో బాగానే సెటిల్ అయ్యారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా మార్చి ఒక్క సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

ఈ సినిమా కోసం 'మీకు మాత్రమే చెప్తాను' అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ టైటిల్ ను ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించాడట. ఈ సినిమా టైటిల్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమా కోసం తరుణ్ భాస్కర్ బాగానే లావు తగ్గాడు. గడ్డం కూడా తీసేసి హీరోగా పలకరించటానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా మెప్పించిన తరుణ్ భాస్కర్ హీరోగా ఎన్ని మార్కులు వేయించుకుంటాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories