విశాఖ అందాల నేపధ్యంలో సరికొత్త ప్రేమ కథా చిత్రం

విశాఖ అందాల నేపధ్యంలో సరికొత్త ప్రేమ కథా చిత్రం
x
Highlights

విశాఖ అందాలు వెండి తెరమీద అద్భుతంగా మెరిసిపోతాయి. ఎన్నో సినిమాలు ఈ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుని తెలుగు తెరకు కొత్తదనాన్ని అద్దాయి. ముఖ్యంగా సరి కొత్త ప్రేమకథలకు విశాఖ నేపధ్యం మరో చరిత్రగా నిలిచింది. ఇప్పుడు ఈ వన్నె తరగని అందాల నేపధ్యంలో సరికొత్త ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతోంది.

లక్ష్మీ గంగా ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత ఎం.ఆనంద్ కొత్త హీరో హీరోయిన్లతో తమ రెండో సినిమా షూటింగ్ ప్రారంభించారు. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. టాకీ పార్ట్ పూర్తిగా ఒకే షెడ్యూల్ గా విశాఖలోనే చిత్రీకరించనున్నట్టు నిర్మాత ఆనంద్ తెలిపారు. ఈ సినిమా ద్వారా అమన్ పాండే, సోనీ రెడ్డి లను హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నట్టు సినిమా దర్శకుడు సంతోష్ చెప్పారు. సినిమాకి కథ, కథనం తొ పాటు పాటలు కూడా తానే రాసినట్టు అయన తెలిపారు.

కుటుంబ బంధాల నేపధ్యంలో.. ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందన్నారు. సినిమా కథనం కొత్తగా ఉంటుందనీ, ఇప్పటి వరకూ ఏ ప్రేమ కథా చిత్రం లోనూ లేని ఒక సరికొత్త పాయింట్ ఈ సినిమాలోఉంటుందన్నారు. ఆ పాయింట్ చుట్టూ సినిమా ఉంటుందనీ, అది ప్రేక్షకులను ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని ఆయన వివరించారు. రెండు నెలల పాటు సినిమా షూటింగ్ విశాఖ పరిసరాల్లో జరుగుతుందని అయన చెప్పారు. ఈ షెడ్యూల్ లో టాకీ పార్ట్ తొ పాటు ఓ పాటను అరకు అందాల నేపధ్యంలో చిత్రీకరిస్తామని సంతోష్ తెలిపారు. సినిమాలో మరో రెండు పాటల్ని పూనే, జంషెడ్ పూర్ లలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

ఎం.శేఖర్ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ సినిమాకు త్వరలోనే పేరు ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. సినిమాకు క్రాంతి కుమార్ ఫోటోగ్రఫీ ప్రత్యెక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ఇంకా ఈ సినిమాలో ఎఫ్.ఎం బాబాయ్, చంద్రశేఖర్, రామన్, వరప్రసాద్, దామోదర్, నాగేశ్వర రావు, లక్ష్మి, పూజ ఇతర స్థానిక నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్టు నిర్మాత ఆనంద్ తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories