సరిలేరు షూటింగ్ లో టాప్ వాటర్.. మహేష్ కి కోపం వచ్చిందా?

సరిలేరు షూటింగ్ లో టాప్ వాటర్.. మహేష్ కి కోపం వచ్చిందా?
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా కాశ్మీర్ లోయలో భారీ...

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా కాశ్మీర్ లోయలో భారీ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. ఇక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రొడక్షన్ బాయ్ ఒకరు చేసిన తప్పుతో మహేష్ బాబు సీరియస్ అయ్యారట.

మహేష్ బాబు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా బోజనం, మంచినీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే, సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ సమయంలో ఓ ప్రొడక్షన్ బాయ్ మినరల్ వాటర్ బదులుగా ట్యాప్ వాటర్ పట్టి అందరికీ ఇచ్చాడట. ఈ విషయాన్ని ఒకరు గమనించి మహేష్ బాబుకు చెప్పారట. దీనితో మహేష్ బాబు చాలా సీరియస్ అయ్యారని తెలుస్తోంది.

నిజానికి మహేష్ బాబు షూటింగ్ లో చాలా సరదాగా ఉంటారు. ఆయన సెట్ లో ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఈ సంఘటన జరిగిన తరువాత మహేష్ పూర్తిగా ముభావంగా అయిపోయారంతున్నారు. షూటింగ్ జరుగుతున్నపుడు తన పని తాను చూసుకుని తరువాత సైలెంట్ గా ఉండిపోయేవారట. ప్రొడక్షన్ మేనేజర్లు.. ఆయనకు సారీ చెప్పి, ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగనివ్వమని చెప్పారట. అయినా కానీ, మహేష్ తన కోప్పాన్ని వీడలేదని సమాచారం.

కాశ్మీర్ లో తన షూటింగ్ పూర్తీ చేసుకుని హైదరాబాద్ చేరుకున్నా కూడా సినిమా ప్రొడక్షన్ యూనిట్ పై తన కోపాన్ని చూపిస్తూనే ఉన్నారట ప్రిన్స్ మహేష్.

కామెడీ జోనర్ లో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ మాత్రం ప్రస్తుతం చాలా సీరియస్ గా మారిపోయిందని వార్తలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories