Tamannah as a host: ఓటీటీ వైపు తమన్నా .. టాక్ షోలో మెరవనున్న మిల్కీ బ్యూటీ!

Tamannah as a host: ఓటీటీ వైపు తమన్నా .. టాక్ షోలో మెరవనున్న మిల్కీ బ్యూటీ!
x
Highlights

Tamannah as a host: కరోనా వల్ల నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. షూటింగ్ లు లేకపోవడం, ధియేటర్లు కూడా బంద్ అవ్వడంతో కొన్ని కోట్ల నష్టం అయితే సినిమా ఇండస్ట్రీ చూసింది. ప్రస్తుతం

Tamannah as a host: కరోనా వల్ల నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. షూటింగ్ లు లేకపోవడం, ధియేటర్లు కూడా బంద్ అవ్వడంతో కొన్ని కోట్ల నష్టం అయితే సినిమా ఇండస్ట్రీ చూసింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల నుంచి అయితే షూటింగ్ లకి అనుమతి లభించింది కానీ ఇంకా ధియేటర్ల పైన ఎలాంటి క్లారిటీ రాలేదు.. ధియేటర్లు ప్రస్తుతానికి ఓపెన్ గా లేకపోవడంతో విడుదలకి సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్.. ఇప్పటికే కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో వచ్చిన పెంగ్విన్, సిద్దు హీరోగా వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ మంచి టాక్ ని సంపాదించుకున్నాయి.

ఈ క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్‌ అహా అనే ఓటీటీ ని ఇటీవ‌ల మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ప్రేక్షకులకు అనుగుణంగా వైవిధ్యభ‌రిత‌మైన కార్యక్రమానికి శ్రీ‌కారం చూడుతున్నారు అయన. ఈ నేపధ్యంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాతో స్పెషల్ గా ఓ టాక్ షో ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. ఇప్పటికే ఈ టాక్ షో కోసం త‌మ‌న్నాతో చర్చలు కూడా ముగిసాయని, దీనికి తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఈ షోలో స్టార్ హీరోలు, హీరోయిన్ లను తమన్నా త‌న ప్రశ్నల‌తో షోను మరింతగా రక్తికట్టించనుంది.

ఇక ప్రస్తుతం తమన్నాకి ఒకప్పటిలాగా సినిమాలు ఏమీ లేవు.. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న సీటిమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో హీరో గోపీచంద్ ఏపీ కబడ్డీ జట్టు కోచ్ గా కనిపించనుండగా, తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించబోతుంది. సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. . దాదాపుగా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. గౌతమ్ నంద చిత్రం తరవాత గోపిచంద్,సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories