సుశాంత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. పోస్ట్‌మార్టం నివేదిక‌ విడుద‌ల..

సుశాంత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. పోస్ట్‌మార్టం నివేదిక‌ విడుద‌ల..
x
Highlights

నిన్న ఆత్మ‌హ‌త్య చేసుకున్న ‌బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృత‌దేహానికి పోస్ట్‌మార్ట‌మ్ పూర్తైంది. అత‌నికి పోస్ట్‌మార్ట‌మ్ చేసిన డా. ఆర్ఎన్...

నిన్న ఆత్మ‌హ‌త్య చేసుకున్న ‌బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృత‌దేహానికి పోస్ట్‌మార్ట‌మ్ పూర్తైంది. అత‌నికి పోస్ట్‌మార్ట‌మ్ చేసిన డా. ఆర్ఎన్ కూప‌ర్ మున్సిప‌ల్ జన‌ర‌ల్ ఆసుప‌త్రి వైద్యులు సోమ‌వారం పోస్ట్‌మార్టం ప్రాథ‌మిక‌ నివేదిక‌ను విడుద‌ల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. అయితే అవ‌య‌వాల్లో విష‌పూరితాలు ఉన్నాయో లేదో ప‌రీక్షించేందుకు న‌టుడి అవ‌యవాల‌ను జేజే ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

కాగా సుశాంత్ 2014 లో 'కై పో చే' తో తొలిసారిగా అడుగుపెట్టాడు.. ఆ తరువాత పికె, కేదార్‌నాథ్, శుధ్ దేశీ రొమాన్స్ , ఎంఎస్ ధోని, ది అన్‌టోల్డ్ జర్నీ వంటి చిత్రాల్లో నటించారు. అతను చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ డ్రైవ్‌లో కనిపించాడు. అలాగే బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం 'దిల్‌ బేచారా'. కాగా ఆరు రోజుల క్రితం సుశాంత్ సింగ్ ద‌గ్గర మేనేజ‌ర్‌గా ప‌ని చేసిన దిశ స‌లియా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఆ తరువాత సుశాంత్ సింగ్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories