సురేందర్ రెడ్డి చేతుల మీదుగా 'మిస్ మ్యాచ్' ట్రైలర్ విడుదల!

సురేందర్ రెడ్డి చేతుల మీదుగా మిస్ మ్యాచ్ ట్రైలర్ విడుదల!
x
Director Surender Reddy Speech after launching the 'Miss Match' Trailer
Highlights

ఆటగదరా శివా ఫేమ్ ఉదయ శంకర్ హీరోగా నటించిన 'మిస్ మ్యాచ్' ట్రైలర్ ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు.

ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా 'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'మిస్ మ్యాచ్' ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా గురించి సినీ బృందం పలు విశేషాలను మీడియాతో పంచుకుంది. ముందుగా రచయిత భూపతి రాజా మాట్లాడుతూ 'మిస్ మ్యాచ్' సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందన్నారు. రెండు కుటుంబాల మధ్య జరిగే కథను దర్శకుడు నిర్మల్ బాగా చూపించారనీ, కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది అవుతుందని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ మాట్లాడుతూ..''నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు, అందరికి నచ్చే పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. డిసెంబర్ 6 న విడుదల కాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు.

దర్శకుడు నిర్మల్ మాట్లాడుతూ…''నా మొదటి తెలుగు సినిమా ఇది. నాకు సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు, మ్యూజిక్ బాగా రావడానికి కారణమైన గిఫ్టన్ గారికి థాంక్స్. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఈ మూవీకి ఉన్నాయి. తప్పకుండా ఆడియన్స్ అందరికి ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను''అని చెప్పారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…మా చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సురేందర్ రెడ్డి గారికి థాంక్స్, మంచి కథ, కథనాలు ఉన్న సినిమ 'మిస్ మ్యాచ్'. నిర్మల్ కుమార్ గారు సినిమాను అందంగా తెరకెక్కించారు. తొలిప్రేమ చిత్రంలోని ఈ మనసే సాంగ్ ఈ సినినిమాలో రీమిక్స్ చేశాం, అందరికి నచ్చుతుంది. డిసెంబర్ 6న మీ ముందుకు వస్తున్న మా సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ముఖ్య అతిధి దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ…''మిస్ మ్యాచ్.. టైటిల్ బాగుంది. హీరో ఉదయ్ బాగా చేసాడు. కథ అందించిన భూపతి గారికి, డైరెక్టర్ నిర్మల్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. డైరెక్టర్ నిర్మల్ తమిళ్ లో చేసిన చదరంగ వెట్టై పెద్ద హిట్, అదే విధంగా తాను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ 'మిస్ మ్యాచ్' సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను, ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు గుడ్ లక్. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

నిర్మాత జి.శ్రీరామ్ రాజు మాట్లాడుతూ..మా చిత్ర ట్రైలర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. దర్శకుడు నిర్మల్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భూపతి రాజా గారు మంచి కథ ఇచ్చారు. ఈ చిత్ర టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశారు. ఉదయ్, ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ బాగా కుదిరింది అని చెప్పారు. ఈ సందర్భంగా తమను ప్రోత్సహిస్తున్న మీడియాకు అయన ధన్యవాదములు తెలిపారు.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం, దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ ., నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్

ఈవార్తను ఇంగ్లీష్ లో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories