బాలీవుడ్ విలన్ని రంగంలోకి దింపనున్న పూరి

బాలీవుడ్ విలన్ని రంగంలోకి దింపనున్న పూరి
x
Highlights

ఒకప్పుడు స్టార్ దర్శకుల్లో ఒకడిగా చలామణి అయిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు. మరొకవైపు ఎనర్జిటిక్ హీరో...

ఒకప్పుడు స్టార్ దర్శకుల్లో ఒకడిగా చలామణి అయిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు. మరొకవైపు ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా మంచి హిట్ అందుకొని చాలా రోజులైంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ చూస్తేనే ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ అని తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రామ్. 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' లలో నటించిన నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇక తాజా సమాచారం ప్రకారం పూరి ఒక బాలీవుడ్ యాక్టర్ ను ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేయడానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. అతను ఎవరో కాదు బాలీవుడ్ స్టైలిష్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న సుధాంశు పాండే. '2.ఓ' చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించిన సుదాన్షు ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే చాలామంది విలన్స్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు మరొక విలన్ ను తెరపైకి తీసుకు రానున్నారు. పూరి జగన్నాథ్ మరియు చార్మి సంయుక్తంగా పురి కనెక్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories