క్యాన్సిల్ అయిన సినిమా ను మళ్ళీ పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్న కృష్ణ వంశీ

క్యాన్సిల్ అయిన సినిమా ను మళ్ళీ పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్న కృష్ణ వంశీ
x
Highlights

గత కొంతకాలంగా దర్శకుడు కృష్ణ వంశీ పరిస్థితి అసలు బాగోలేదు. చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వడంలేదు. ఈమధ్యనే 'నక్షత్రం' సినిమా తో 2017 లో ప్రేక్షకులను...

గత కొంతకాలంగా దర్శకుడు కృష్ణ వంశీ పరిస్థితి అసలు బాగోలేదు. చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వడంలేదు. ఈమధ్యనే 'నక్షత్రం' సినిమా తో 2017 లో ప్రేక్షకులను పలకరించారు కానీ ఆ సినిమా కూడా బాక్సఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కనీసం తదుపరి సినిమా అయినా హిట్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా షూటింగ్ స్టేజ్ లోనే అటకెక్కిన విషయం తెలిసిందే. 'నక్షత్రం' సినిమా తర్వాత కృష్ణవంశీ 'రుద్రాక్ష' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. సోషియో ఫాంటసీ సినిమా గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సమంత మరియు రమ్య కృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. ఒకప్పుడు టాలీవుడ్ ను వరుస హిట్ సినిమాలతో ఏలిన కృష్ణవంశీ ఇప్పుడు ఒక్క హిట్ అందుకోడానికి కూడా కష్ట పడటం దురదృష్టం. అయితే కృష్ణవంశీ ఇంకా ఈ సినిమాను ఎలాగైనా మళ్ళీ పట్టాలెక్కించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ అన్ని కుదిరినప్పటికీ ఈ సినిమాలో కొత్త నటీనటులు నటించాల్సి ఉంటుంది. మరి కృష్ణవంశీ హిట్ అందిస్తారో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories