వివాదం వర్మ పక్క పక్కనే ఉంటారు. ఆర్జీవీ ఎటు కదిల్తే అటు వివాదం కదులుతుందో.. వివాదం కోసం ఆయనే అటు కడులుతాడో చెప్పలేని పరిస్థితి. సోషల్ మీడియాలో వివాదాల్ని సృష్టించడం లో వర్మకు ఎవరూ సాటి రారు. ఇప్పుడు ఆయన ట్వీట్ కి ఆయనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు బలైపోయారు.
రామ్ గోపాల్ వర్మ పెద్దగా పేరుతో పరిచయం అక్కరలేని వ్యక్తి .. ఎప్పుడు ఎదో ఒక కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు ... తాజాగా ఈ రోజు టీచర్స్ డేని పురస్కరించుకొని వర్మ వివాదాస్పద కామెంట్స్ చేసాడు . ప్రస్తుతం అయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి ... 'టీచర్స్ డే రోజు టీచర్లు టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా.. జస్ట్ ఆస్కింగ్' అంటూ వర్మ ఓక ట్వీట్ చేస్తూ తన ఫోటోను అటాచ్ చేసాడు .
Do Teachers celebrate TEACHER'S DAY by drinking TEACHER'S WHISKY? ..just asking! pic.twitter.com/n5C5qSejow
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2019
ఇదే కాకుండా మరో పోస్ట్ చేసాడు . నన్ను మంచి విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో నా టీచర్లు అందరూ ఫెయిల్ అయ్యారు. అందువల్ల నాకు టీచర్స్ డే అంటే ఏంటో తెలియదు. నేను ఒక బ్యాడ్ స్టూడెంట్ను. నన్ను మంచిగా చేయలేకపోయిన టీచర్స్ కూడా గుడ్ కాదు' అంటూ పోస్ట్ చేసాడు వర్మ .. అయితే వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ కావడంతో నెటిజన్లు వర్మని విమర్శిస్తున్నారు ...
All my teachers miserably failed in making me a good student and a good human being .So I don't know what to say about TEACHER'S DAY😡
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire