ఆఫర్ లను తిరస్కరిస్తున్న "పుష్ప: ది రూల్" నిర్మాతలు

Pushpa The Rule Movie Producers Rejecting Offers | Movie News
x

ఆఫర్ లను తిరస్కరిస్తున్న "పుష్ప: ది రూల్" నిర్మాతలు

Highlights

*ఆఫర్ లను తిరస్కరిస్తున్న "పుష్ప: ది రూల్" నిర్మాతలు

Pushpa Producers: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను అందుకొని ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా కూడా బాలీవుడ్ లో మంచి వసూళ్లు నమోదు చేసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది.

అయితే చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారికి బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నాయట. కానీ మైత్రి వారు మాత్రం ఈ సినిమా రైట్స్ ను అమ్మడానికి ఆసక్తి చూపించడం లేదు."పుష్ప: ది రైజ్" సమయంలో బాలీవుడ్ లో తమ సినిమాకి అంత బజ్ లేదు అనుకొని మైత్రి వారు వేరే వారికి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారు కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా బన్నీకి ఉన్న క్రేజ్ ని బాగా అర్థం చేసుకున్న మైత్రి వారు "పుష్ప: ది రూల్" విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి అనుకుంటున్నారు. అందుకే తమ సినిమాని తామే ఓన్ గా బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకోడానికి సిద్ధమవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ.

Show Full Article
Print Article
Next Story
More Stories