విడుదలకు ముందే సీక్వెల్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు

విడుదలకు ముందే సీక్వెల్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు
x
Highlights

ఒకవైపు ఈ మధ్యనే 'మెహబూబా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న పూరి జగన్నాథ్, మరొకవైపు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. వీరిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' అనే...

ఒకవైపు ఈ మధ్యనే 'మెహబూబా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న పూరి జగన్నాథ్, మరొకవైపు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. వీరిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. పూరి మరియు చార్మి పూరి కనెక్ట్ పతాకంపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరి కొత్త లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమా ఇంకా విడుదల అవ్వలేదు కానీ అప్పుడే ఈ చిత్రానికి సీక్వెల్ తీసే సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం.

తాజా సమాచారం ప్రకారం 'డబుల్ స్మార్ట్' అనే టైటిల్ ను ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేశారు. ఈ సినిమా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. నిజానికి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఆకాష్ పూరి హీరోగా నటించాలి కానీ ఈ స్క్రిప్ట్ స్క్రిప్ట్ కు ఎవరైనా పాపులర్ హీరో అయితే బాగుంటుందని అందరూ చెప్పడంతో పూరి జగన్నాథ్ ఈ సినిమాని రామ్ తో తెరకెక్కించనున్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే సినిమాకు సీక్వెల్ తీసే ప్లాన్లు మొదలు పెట్టడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories