మెగాస్టార్ చిరంజీవి కథతో ప్రభాస్ సినిమా?

మెగాస్టార్ చిరంజీవి కథతో ప్రభాస్ సినిమా?
x
Megastar Chiranjeevi and Prabhas File Photo
Highlights

తన కోసం వచ్చిన కథను మెగాస్టార్ చిరు..ప్రభాస్ కోసం వదిలేసారట. తాజాగా ప్రభాస్ ఓ పాన్ ఇండియా సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తన కోసం వచ్చిన కథను మెగాస్టార్ చిరు..ప్రభాస్ కోసం వదిలేసారట. తాజాగా ప్రభాస్ ఓ పాన్ ఇండియా సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అశ్వనీదత్ నిర్మాతగా..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అయితే..ఈ సినిమా కథను మొదట చిరంజీవికి వినిపించారట నాగ్ అశ్విన్.

వైజయంతి మూవీస్ సంస్థ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త సినిమాను ప్రకటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ గర్వపడేలా ఈ సినిమాను తెరకెక్కిస్తానని నాగ్ అశ్విన్ అన్నారు. దీనిని ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ముందు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వచ్చిందని చెప్పుకుంటున్నారు. 'మహానటి' సినిమా ప్రమోషన్స్ సమయంలో నాగ్ అశ్విన్ చిరంజీవి కోసం ఓ సైన్స్ ఫిక్షన్ కథ తయారుచేసుకుంటున్నానని, త్వరలో ఆయనకు కథ వినిపిస్తానని చెప్పారు. అదీకాక వైజయంతి తన స్వర్ణోత్సవ సినిమా చిరంజీవితో చేయలనుకున్నారు. దీంతో నాగ్ అశ్విన్ చిరుకోసం కథ సిద్ధం చేసి ఆయనకు వినిపించారట.

ఈ కథ విన్న చిరు ఈ సినిమాను తాను చేయడం కంటే ప్రభాస్‌ చేస్తే ఇంకా బాగుంటుంది అని నాగ్ అశ్విన్‌కి చెప్పారంట. 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ సినిమాను చేస్తే బాగుంటుందని చిరు అభిప్రాయపడ్డారట. ఇందుకు అశ్విన్ కూడా ఒప్పుకోవడంతో ప్రభాస్‌కు కథ వినిపించారు. చిరంజీవి రిఫర్ చేసిన స్క్రిప్ట్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రభాస్‌కి కూడా తెలుసు. అందుకే మరేమీ ఆలోచించకుండా సినిమాను ఓకే చేసేసారట ప్రభాస్. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories