చిరు మెసేజ్.. సాహో ఫోన్!

చిరు మెసేజ్.. సాహో ఫోన్!
x
Highlights

సాహో విడుదల తేదీ దగ్గర పడుతుండడం తో ప్రమోషన్ పనుల్లో బిజీగా మారింది సినిమా టీం. సాహో ట్రైలర్ చూసిన చిరంజీవి ప్రభాస్ ను ప్రశంసిస్తూ మెసేజ్ చేశారు. దానికి ప్రభాస్ వెంటనే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్టు విలేకరులకు తెలిపారు.

సాహో ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. నిన్ననే విడుదల చేసిన ట్రైలర్ కి భారీ స్థాయిలో ప్రశంసలు పొందుతోంది సాహో టీం. ఈ సందర్భంగా ప్రభాస్ విలేకరులతో మాట్లాడారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పారు. దర్శక దిగ్గజం రాజమౌళి ట్రైలర్ చూసి హ్యాపీగా ఫీలయ్యారని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా ట్రైలర్ చూసి మెసేజ్ చేశారని ప్రభాస్ వెల్లడించారు. వెంటనే తాను ఆయనకు ఫోన్ చేశానని చెప్పారు. అయన సినిమా ట్రైలర్ చాలా బావుందని ప్రశంసించారు. అది చాలా గొప్ప ఫీలింగ్ అని ప్రభాస్ చెప్పారు. ఇక తాను సాహో తరువాత ఓ లవ్ స్టోరీ చేయబోతున్నానని చెప్పారు. గోపీకృష్ణా బేనర్ లో ఆసినిమా ఉంటుందని తెలిపారు.

కాగా అత్యధిక బడ్జెట్ తో ప్రపంచ స్థాయి సినిమాగా సాహో ని తెరకెక్కించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లు శరవేగంగా కానిస్తూనే, మరోపక్క ప్రమోషన్ వర్క్ కూడా మొదలు పెట్టారు. దానిలో భాగంగా సరికొత్త ట్రైలర్ విడుదల చెశారు. ఆ ట్రైలర్ అందర్నీ థ్రిల్ చేస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories