బాలీవుడ్ గాలి సోకిన టాలీవుడ్ స్టార్ బ్యూటీ

బాలీవుడ్ గాలి సోకిన టాలీవుడ్ స్టార్ బ్యూటీ
x
Highlights

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ముకుంద' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది డస్కీ బ్యూటీ పూజ హెగ్డే. వెంటనే నాగచైతన్య సరసన 'ఒక లైలా కోసం' సినిమాలో నటించింది...

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ముకుంద' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది డస్కీ బ్యూటీ పూజ హెగ్డే. వెంటనే నాగచైతన్య సరసన 'ఒక లైలా కోసం' సినిమాలో నటించింది కానీ ఆ రెండు సినిమాలు ఈమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి హృతిక్ రోషన్ సరసన 'మొహంజోదారో' అనే సినిమాలో నటించింది కానీ ఆ సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో ఇక చేసేది లేక మళ్లీ టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. కానీ అల్లు అర్జున్ నటించిన 'డీజే' సినిమా లో ఈమెకి టర్నింగ్ పాయింట్ దొరికింది. ఆ సినిమాలో తన బికినీ అందాలతో అందరి దృష్టిని ఆకర్షించిన స్టార్ హీరోలతో సినిమా చేయడం మొదలు పెట్టింది.

ఈ మధ్యనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమాలో నటించిన పూజ హెగ్డే ఇప్పుడు మహేష్ బాబు తో 'మహర్షి' మరియు ప్రభాస్ తో ప్రభాస్20 వంటి సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈమెకి బాలీవుడ్ నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. ఇప్పటికే ఈమె నటించిన 'హౌస్ ఫుల్ 4' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మరొక రెండు సినిమాలకు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసిందని తెలుస్తోంది.అంటే ఈమె ఇంకొక రెండు నెలలపాటు పూర్తిగా బాలీవుడ్లోనే ఉండబోతోంది. మరి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న పూజా హెగ్డే ఇప్పుడు ఈ సినిమాలతో బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories