త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'భీష్మ'

Nithin
x
Nithin
Highlights

'అ ఆ' సినిమా సూపర హిట్ అయిన తర్వాత నితిన్ కెరీర్ లో చాలా ఎత్తుకు ఎదుగుతాడు అనుకుంటే మూడు వరుస డిజాస్టర్ లతో డీలా పడిపోయాడు. 'లై', 'చల్ మోహన్ రంగ' లాంటి సినిమాల తరువాత ఈ మధ్యనే విడుదలైన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

'అ ఆ' సినిమా సూపర హిట్ అయిన తర్వాత నితిన్ కెరీర్ లో చాలా ఎత్తుకు ఎదుగుతాడు అనుకుంటే మూడు వరుస డిజాస్టర్ లతో డీలా పడిపోయాడు. 'లై', 'చల్ మోహన్ రంగ' లాంటి సినిమాల తరువాత ఈ మధ్యనే విడుదలైన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ప్రస్తుతం నితిన్ 'చలో' ఫేమ్ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. 'భీష్మ' అనే టైటిల్ తో మన ముందుకు రాబోతున్న ఈ సినిమాకు 'సింగల్ ఫరెవర్' అనే ఆసక్తికరమైన ఉపశీర్షికను పెట్టారు.

ఇక చలో సినిమా లాగానే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చిత్ర బృందం చెబుతున్నారు.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఇక ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'చలో' సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మి క మందన్నా నే మళ్లీ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమా అయినా నితిన్ కి మంచి హిట్ ను అందిస్తుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories