'దటీజ్ మహాలక్ష్మి' కి మరో వివాదం తప్పదా

దటీజ్ మహాలక్ష్మి కి మరో వివాదం తప్పదా
x
Highlights

బాలీవుడ్లో కంగనా రనౌత్ ముఖ్య పాత్ర పోషించిన 'క్వీన్' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా నాలుగు సౌత్ భాషల్లో రీమేక్ అవ్వనుంది....

బాలీవుడ్లో కంగనా రనౌత్ ముఖ్య పాత్ర పోషించిన 'క్వీన్' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా నాలుగు సౌత్ భాషల్లో రీమేక్ అవ్వనుంది. తమిళం, మలయాళం, కన్నడ భాషలు పక్కన పెడితే, తెలుగు భాషలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. 'దటీజ్ మహాలక్ష్మి' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి నీలకంఠ ముందుగా దర్శకత్వం వహించారు. కారణాలు తెలియదు కానీ ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాలో సగం క్రెడిట్ నీలకంఠ కు దక్కాలంటూ సన్నిహితులు అంటున్నారు. మరొకవైపు నీలకంఠ కూడా 'దట్ ఈజ్ మహాలక్ష్మి' సినిమా క్రెడిట్ మొత్తం తనకే దక్కుతుందని సన్నిహితులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ప్రశాంత్ వర్మ కూడా తనకు క్రెడిట్ దక్కుతుందని అనుకుంటున్నాడు. ఇక తమన్నా మాత్రం నీలకంఠ సినిమా నుండి తప్పుకోవడంలో తన ప్రమేయం ఏమీ లేదని ఈ సినిమా నుండి తప్పుకున్నప్పటికి తనతో స్నేహం గానే ఉంటున్నారని చెప్పుకొస్తోంది. ఇంతకీ ఈ సినిమా క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీగానే మిగిలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories