అప్పుడు తండ్రి కొడుకులు ఇప్పుడు తాతా మనవడు

అప్పుడు తండ్రి కొడుకులు ఇప్పుడు తాతా మనవడు
x
Highlights

కింగ్ నాగార్జున డ్యూయల్ రోల్ లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

కింగ్ నాగార్జున డ్యూయల్ రోల్ లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా 'బంగార్రాజు' అనే సినిమా తెరకెక్కనుంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు ఈ సినిమాకు స్క్రిప్ట్ రాయడం లో బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను మల్టీస్టారర్ గా మారుద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాలో నాగార్జున తో పాటు నటించనున్న మరొక హీరో అక్కినేని నాగ చైతన్య అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య కలిసి మనం సినిమాలో నటించారు ఆ సినిమాలో తండ్రీ కొడుకులుగా కనిపించిన నాగ్, చై ఈ సినిమాలో తాతా-మనవడు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య నాగార్జున మనవడి పాత్రలో కనిపించనున్నాడట. అయితే ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories