హ్యాకింగ్‌ బారిన పడ్డ మరో హీరోయిన్‌

హ్యాకింగ్‌ బారిన పడ్డ మరో హీరోయిన్‌
x
Highlights

'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మేఘా ఆకాష్ మళ్లీ నితిన్ సరసన 'చల్ మోహన్ రంగా' సినిమాలో నటించింది. కానీ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్...

'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మేఘా ఆకాష్ మళ్లీ నితిన్ సరసన 'చల్ మోహన్ రంగా' సినిమాలో నటించింది. కానీ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో ఇక ఈమె ప్రస్తుతం కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే ఈమె అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశాడట. ఈ విషయాన్ని తెలుపుతూ మేఘా తన ట్విట్టర్ ఖాతా నుండి 'నా ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయింది! దయచేసి మెసేజులను, పిచ్చి పోస్టులను పట్టించుకోకండి. నా బ్యాకెండ్ టీమ్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. త్వరలో న ఖాతా కంట్రోల్ లోకి వస్తుంది. థ్యాంక్ యూ." అని ట్వీట్ చేసింది

తాజాగా ఈమె టీం సభ్యులు ఖాతాను రిట్రీవ్ చేశారట. ఆ విషయాన్ని ఫాన్స్ తో సంతోషంగా పంచుకుంటూ, "హాయ్.. మా టీం చాలా హార్డ్ వర్క్ మరియు స్ట్రగుల్ చేసిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ మళ్ళీ నాకు వచ్చింది. ప్రైవసీని పోగొట్టుకోవడం చాలా బాధాకరం కానీ ఇప్పుడు నేను హ్యాపీ. అంతా ఒకే. థ్యాంక్ యూ." అని ట్వీట్ చేసింది మేఘా ఆకాష్. ఇక ఈ మధ్యనే తమిళంలో 'వంత రాజవతాన్ వరువేన్' అనే సినిమాలో ఈమె శింబు సరసన కనిపించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అత్తారింటికి దారేది' సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో మాత్రం ఫట్టయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories